Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైద రవీందర్ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 02:28 PM

డివైడర్‌ను ఢీకొట్టిన కారు: క్యాటరింగ్ యజమాని మృతి

డివైడర్‌ను ఢీకొట్టిన కారు: క్యాటరింగ్ యజమాని మృతి

డివైడర్‌ను ఢీకొట్టిన కారు: క్యాటరింగ్ యజమాని మృతి
May 05, 2026 12:23 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తూప్రాన్‌పేట వద్ద ప్రమాదం.. మరో నలుగురికి గాయాలు

సినిమా షూటింగ్‌ పనులకు వెళ్తుండగా విషాదం

నిర్మాణంలో ఉన్న డివైడర్‌ను కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా, మరో నలుగురు గాయపడ్డారు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కృష్ణానగర్‌లో నివసించే రుద్రరాజు వీర వెంకటరామరాజు (40) సినిమా షూటింగ్‌లకు క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. మంగళవారం ఉదయం ఆయన తన టీమ్ సభ్యులు నాయుడు, రామకృష్ణ, రమేష్ కుమార్, శ్రీనివాసరాజులతో కలిసి టయోటా క్వాలిస్ కారులో (AP37 AG 3999) హైదరాబాద్ నుండి మల్కాపురం వైపు బయలుదేరారు.​ కరీంనగర్‌కు చెందిన తిప్పని శ్రీకర్ వాహనాన్ని నడుపుతుండగా, ఉదయం 6:10 గంటల సమయంలో తూప్రాన్‌పేట గ్రామ పరిధిలోని కొత్త బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చున్న వెంకటరామరాజు తలకు తీవ్ర గాయమైంది. వాహనంలోని మిగతా నలుగురికి పలుచోట్ల గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో అబ్దుల్లాపూర్ మెట్ లోని మనోజ్ఞ ఆస్పత్రికితరలించారు.వెంకటరామరాజను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి తమ్ముడు గుంటూరు సాయి రవి వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News