Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:51 AM

డివైడర్‌ను ఢీకొట్టిన కారు: క్యాటరింగ్ యజమాని మృతి

డివైడర్‌ను ఢీకొట్టిన కారు: క్యాటరింగ్ యజమాని మృతి

డివైడర్‌ను ఢీకొట్టిన కారు: క్యాటరింగ్ యజమాని మృతి
May 05, 2026 12:23 PM 196 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తూప్రాన్‌పేట వద్ద ప్రమాదం.. మరో నలుగురికి గాయాలు

సినిమా షూటింగ్‌ పనులకు వెళ్తుండగా విషాదం

నిర్మాణంలో ఉన్న డివైడర్‌ను కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా, మరో నలుగురు గాయపడ్డారు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కృష్ణానగర్‌లో నివసించే రుద్రరాజు వీర వెంకటరామరాజు (40) సినిమా షూటింగ్‌లకు క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. మంగళవారం ఉదయం ఆయన తన టీమ్ సభ్యులు నాయుడు, రామకృష్ణ, రమేష్ కుమార్, శ్రీనివాసరాజులతో కలిసి టయోటా క్వాలిస్ కారులో (AP37 AG 3999) హైదరాబాద్ నుండి మల్కాపురం వైపు బయలుదేరారు.​ కరీంనగర్‌కు చెందిన తిప్పని శ్రీకర్ వాహనాన్ని నడుపుతుండగా, ఉదయం 6:10 గంటల సమయంలో తూప్రాన్‌పేట గ్రామ పరిధిలోని కొత్త బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చున్న వెంకటరామరాజు తలకు తీవ్ర గాయమైంది. వాహనంలోని మిగతా నలుగురికి పలుచోట్ల గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో అబ్దుల్లాపూర్ మెట్ లోని మనోజ్ఞ ఆస్పత్రికితరలించారు.వెంకటరామరాజను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి తమ్ముడు గుంటూరు సాయి రవి వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News