ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొహమ్మద్ హఫీజుద్దీన్ను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖామాత్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుంబూరు దయాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా హఫీజుద్దీన్కు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బెల్లంకొండ శరత్, యువజన కాంగ్రెస్ నాయకులు వాహాబ్, రవి నాయక్, లచ్చు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి