Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:19 AM

ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర

ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర

ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర
May 02, 2026 08:44 PM 314 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు పూర్తయ్యిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. గత ఏడాదిలోనే గ్యాస్ ధరలు మూడుసార్లు పెరిగి రూ.993కు చేరుకోవడం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ధరల పెరుగుదలతో జీవన వ్యయం పెరిగి సామాన్యుల జీవితం దుర్భరమవుతోందని పేర్కొన్నారు.

ప్రధాని గతంలో గ్యాస్ ధరలు పెరగవని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉజ్వల యోజన పేరుతో ప్రచారం చేసిన బీజేపీ నాయకులు పెరిగిన ధరలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News