ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర
ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర
Editor Desk
హైదరాబాద్, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర ఆరోపించారు. గాంధీభవన్లో శనివారం మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలు పూర్తయ్యిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. గత ఏడాదిలోనే గ్యాస్ ధరలు మూడుసార్లు పెరిగి రూ.993కు చేరుకోవడం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ధరల పెరుగుదలతో జీవన వ్యయం పెరిగి సామాన్యుల జీవితం దుర్భరమవుతోందని పేర్కొన్నారు.
ప్రధాని గతంలో గ్యాస్ ధరలు పెరగవని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉజ్వల యోజన పేరుతో ప్రచారం చేసిన బీజేపీ నాయకులు పెరిగిన ధరలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి