Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 10:07 PM

ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర

ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర

ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర
May 02, 2026 08:44 PM 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు పూర్తయ్యిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. గత ఏడాదిలోనే గ్యాస్ ధరలు మూడుసార్లు పెరిగి రూ.993కు చేరుకోవడం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ధరల పెరుగుదలతో జీవన వ్యయం పెరిగి సామాన్యుల జీవితం దుర్భరమవుతోందని పేర్కొన్నారు.

ప్రధాని గతంలో గ్యాస్ ధరలు పెరగవని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉజ్వల యోజన పేరుతో ప్రచారం చేసిన బీజేపీ నాయకులు పెరిగిన ధరలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News