ధరల పెరుగుదలపై 10న కలెక్టరేట్ ముట్టడి
ధరల పెరుగుదలపై 10న కలెక్టరేట్ ముట్టడి
K.RAVI
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీపీఐ నేత పల్లె శేఖర్ రెడ్డి మండిపాటు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతూ సామాన్యుడి బతుకును భారంగా మార్చిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. అధిక ధరలను నిరసిస్తూ ఈ నెల 10న చేపట్టే కలెక్టరేట్ ముట్టడి (ధర్నా) కరపత్రాలను సోమవారం చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ముగియగానే నెలలో మూడుసార్లు ఇంధన ధరలు పెంచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ధరల పెరుగుదలను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ కు పాల్పడుతున్న అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10న జరిగే ధర్నాను ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ చౌటుప్పల్ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు పిల్లి శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, ప్రముఖ నాయకులు టంగుటూరు రాములు, దాసరి అంజయ్య, బద్దుల సుధాకర్, దాసరి యాదయ్య, ఉబ్బు సుదర్శన్, డి. కృష్ణ, శంకర్ బాబు, డి. మనోహర్, చింటు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి