PRINT TIME: May 05, 2026 03:30 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు
May 05, 2026 01:48 PM
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వలిగొండ :
రైతులు మార్కెట్లలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు.
సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్లలో ధాన్యం పోసి నెలరోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని అన్నారు.
తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, లారీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరారు. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.
రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి