ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Vikram
సూర్యాపేట నియోజకవర్గంలో పట్టణంలోని 11వ వార్డు రాయినిగూడెంలో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మేప్మా) ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు సదుపాయాలు కల్పించడం ద్వారా వారికి నష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్గురి ఇందిరా, వీరయ్య, వెక్కంటి శేఖర్ రెడ్డి, కోడి నాగరాజు యాదవ్, కుంభం రాజేందర్, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలుగూరి వెంకటేశం గౌడ్, కొడగండ్ల ఉపేందర్ రెడ్డి, పిండిగా విజయ్, కోడి శివ, ముత్యాల సైదులు, చిత్తలూరి కృష్ణ, ముత్యాల పిచ్చయ్య, కప్పల రామ్ రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, మందాడి రామ్ రెడ్డి, యలగబోయిన మధు యాదవ్, నంద్యాల వీరారెడ్డి, నంద్యాల శేఖర్ రెడ్డి, రేపాల దేవేందర్ రెడ్డి, రేపాల సుధీర్ రెడ్డి, కామల్ల లింగయ్య, జంగిలి సైదులు, ఎడ్ల ఉపేందర్, ముత్యాల శేఖర్, కోడి కిరణ్, పిల్లల నాగరాజు, మేప్మా కోఆర్డినేటర్ రమేష్ నాయక్, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి