ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగకుండా చర్యలు తీసుకోవాలి.. మండల పార్టీ అధ్యక్షుడుతాటికొండ సీతయ్య
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగకుండా చర్యలు తీసుకోవాలి.. మండల పార్టీ అధ్యక్షుడుతాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీరు. తీరు అవినీతి కార్యక్రమాలకు నిర్వాహకులు. సంబంధిత అధికారులు పాల్పడుతున్నారనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ఒక కేంద్రంలో తూకాల్లో మోసం. మరొక కేంద్రం లో వేరే రైతుల వద్ద ధాన్యం తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఐకెపి లో మద్దతు ధరకు అమ్మడం. మిల్లర్ తో కుమ్మక్కై తుకాల్లో కటింగ్ చేయించడం. లారి లోడింగ్ చేస్తున్న సందర్భంగా లారీలో వేసిన ధాన్యం బస్తాలను ఎక్కువగా ట్రక్ షీట్ లో నమోదు చేసిరైతులను మోసం చేస్తున్నారని. ఇట్టి మోసాలల్లో మండల స్థాయి నుండి మొదలు కొని జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములేనన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని. రైతాంగాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్. ఉప్పల నాగమల్లు.. నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి