Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 07:25 PM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.  తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి
May 04, 2026 06:15 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, తాలు–తరుగుడు పేరుతో రైతులను దోపిడీ చేయవద్దని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

సిరిపురం గ్రామంలో సిపిఎం నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలు, ఎండల తీవ్రతతో రైతాంగం మరింత నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని చెప్పారు.

వడ్లు పట్టేందుకు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టిన రైతులకు తాలు పేరుతో కోతలు విధించడం అన్యాయమని మండిపడ్డారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, అంబటి మల్లారెడ్డి, కూనూరు వెంకటేశం, దాడి మల్లారెడ్డి, అంబటి సురేందర్ రెడ్డి, బైరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News