Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:47 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.  తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి
May 04, 2026 06:15 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, తాలు–తరుగుడు పేరుతో రైతులను దోపిడీ చేయవద్దని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

సిరిపురం గ్రామంలో సిపిఎం నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలు, ఎండల తీవ్రతతో రైతాంగం మరింత నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని చెప్పారు.

వడ్లు పట్టేందుకు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టిన రైతులకు తాలు పేరుతో కోతలు విధించడం అన్యాయమని మండిపడ్డారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, అంబటి మల్లారెడ్డి, కూనూరు వెంకటేశం, దాడి మల్లారెడ్డి, అంబటి సురేందర్ రెడ్డి, బైరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News