PRINT TIME: July 03, 2026 07:50 PM
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం.. నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ధర్నా
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం.. నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ధర్నా
May 11, 2026 02:24 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, తూకాల్లో అక్రమాలు, రైతులకు సరైన మద్దతు ధర అందకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి