ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు.
రోజుల తరబడి కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యపు కుప్పలను పరిశీలించిన ఆయన, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట పండించడం కంటే పండించిన ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకోవడం కష్టంగా మారిందని రైతులు వాపోయారు. వాతావరణ మార్పులతో తీవ్ర ఆందోళనలో ఉన్నామని తెలిపారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమే అయినా, ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు చేయడం అనర్హమని అన్నారు. స్థానికంగా కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి, ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరిగినా, రైతులకు నష్టం కలిగినా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్దాస్ విక్రమ్, భోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోస బోయిన మల్లేశం, నాయకులు పున్న వెంకటేశం, బత్తుల వెంకటేష్, అమీర్ మందడి సాగర్ రెడ్డి, బద్దుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి