Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:24 AM

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
April 30, 2026 02:21 PM 505 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు.

రోజుల తరబడి కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యపు కుప్పలను పరిశీలించిన ఆయన, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట పండించడం కంటే పండించిన ధాన్యాన్ని మార్కెట్‌లో అమ్ముకోవడం కష్టంగా మారిందని రైతులు వాపోయారు. వాతావరణ మార్పులతో తీవ్ర ఆందోళనలో ఉన్నామని తెలిపారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమే అయినా, ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు చేయడం అనర్హమని అన్నారు. స్థానికంగా కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి, ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరిగినా, రైతులకు నష్టం కలిగినా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్దాస్ విక్రమ్, భోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోస బోయిన మల్లేశం, నాయకులు పున్న వెంకటేశం, బత్తుల వెంకటేష్, అమీర్ మందడి సాగర్ రెడ్డి, బద్దుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News