Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 07:47 PM

ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించండి..​

ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించండి..​

ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించండి..​
May 04, 2026 06:34 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి..

అకాల వర్షాల నేపథ్యంలో కలెక్టర్లకు మంత్రుల ఆదేశం..

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ బి. చంద్రశేఖర్..

నల్లగొండ : రానున్న మూడు, నాలుగు రోజుల్లో జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల నేపథ్యంలో, ధాన్యం సేకరణపై సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా పరిస్థితిని అడగ్గా.. ఆదివారం సాయంత్రం నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసిందని కలెక్టర్ వివరించారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు టార్పాలిన్లు కప్పుకున్నప్పటికీ గాలుల తీవ్రతకు అవి ఎగిరిపోయి కొంత ధాన్యం తడిసిందని ప్రస్తుతం ఆ ధాన్యం ఆరిపోయిందని కలెక్టర్ మంత్రికి వివరించారు.

అప్రమత్తంగా ఉండాలి.. మంత్రుల సూచన

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మే నెల ధాన్యం సేకరణకు అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్లు వాతావరణ శాఖ నివేదికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా ఉన్నందున గన్నీ బ్యాగులు రవాణా సమస్యలు లేకుండా చూడాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శుల నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు తడవకుండా చూడాలని లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డి.ఆర్.డి.ఓ. శేఖర్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, పౌరసరఫరాలు మరియు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News