భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు
భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు
K.RAVI
మలిగే ఉషయ్య నివాసంలో వేడుకలు.. పాల్గొన్న కౌన్సిలర్ మధుసూదన్, శివకుమార్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ సమీపంలో వెలసిన ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వార్డులోని ప్రముఖులు మలిగే ఉషయ్య గారి నివాసంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుకల్లో ఆయనతో కలిసి స్థానిక నాయకులు చెరుకు శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి