Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేసీఆర్ శకం ముగిసింది: ఎంపీ అర్వింద్ క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 10:35 PM

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు
May 03, 2026 09:19 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మలిగే ఉషయ్య నివాసంలో వేడుకలు.. పాల్గొన్న కౌన్సిలర్ మధుసూదన్, శివకుమార్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ సమీపంలో వెలసిన ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వార్డులోని ప్రముఖులు మలిగే ఉషయ్య గారి నివాసంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుకల్లో ఆయనతో కలిసి స్థానిక నాయకులు చెరుకు శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.

​అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News