Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:51 AM

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు
May 03, 2026 09:19 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మలిగే ఉషయ్య నివాసంలో వేడుకలు.. పాల్గొన్న కౌన్సిలర్ మధుసూదన్, శివకుమార్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ సమీపంలో వెలసిన ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వార్డులోని ప్రముఖులు మలిగే ఉషయ్య గారి నివాసంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుకల్లో ఆయనతో కలిసి స్థానిక నాయకులు చెరుకు శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.

​అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News