Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:11 AM

దేవాలయ భూములను పరిరక్షించాల్సిందే: నాగరాజు గౌడ్

దేవాలయ భూములను పరిరక్షించాల్సిందే: నాగరాజు గౌడ్

దేవాలయ భూములను పరిరక్షించాల్సిందే: నాగరాజు గౌడ్
06-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేవాలయాలకు సంబంధించిన భూములను కాపాడటం ప్రభుత్వ అధికారుల ముఖ్య బాధ్యత అని బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి తో కలిసి పట్టణంలోని బైరాగి మఠానికి చెందిన భూములను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, బైరాగి మఠం భూములపై జరిగిన అక్రమ కబ్జాల విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం కార్యాలయం, సంబంధిత శాఖలు మరియు రెవెన్యూ అధికారులకు పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

బైరాగి మఠానికి చెందిన భూములను గతంలో కొందరు రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి అక్రమంగా తమ పేర్లపై నమోదు చేసుకుని విక్రయాలు జరిపినట్లు ఆయన ఆరోపించారు. దేవాలయ భూములను ఆక్రమించిన వారెవరు అయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, బీజేపీ యూత్ వింగ్ మండల అధ్యక్షుడు రవిశంకర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేవాలయ భూములను పరిరక్షించాల్సిందే: నాగరాజు గౌడ్

Article Image

దేవాలయాలకు సంబంధించిన భూములను కాపాడటం ప్రభుత్వ అధికారుల ముఖ్య బాధ్యత అని బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి తో కలిసి పట్టణంలోని బైరాగి మఠానికి చెందిన భూములను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, బైరాగి మఠం భూములపై జరిగిన అక్రమ కబ్జాల విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం కార్యాలయం, సంబంధిత శాఖలు మరియు రెవెన్యూ అధికారులకు పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

బైరాగి మఠానికి చెందిన భూములను గతంలో కొందరు రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి అక్రమంగా తమ పేర్లపై నమోదు చేసుకుని విక్రయాలు జరిపినట్లు ఆయన ఆరోపించారు. దేవాలయ భూములను ఆక్రమించిన వారెవరు అయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, బీజేపీ యూత్ వింగ్ మండల అధ్యక్షుడు రవిశంకర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News