డీటీసీపీ లేఔట్స్, ఆధునిక సౌకర్యాలతో ఇండ్లు – బండ నరేందర్ రెడ్డి
డీటీసీపీ లేఔట్స్, ఆధునిక సౌకర్యాలతో ఇండ్లు – బండ నరేందర్ రెడ్డి
Editor Desk
నల్లగొండ పట్టణంలోని గుండ్లపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శివానంద్ హోమ్స్ను మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇలాంటి నివాస ప్రాజెక్టులు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు.
ప్రాజెక్ట్ నిర్వాహకుడు ఆమంచి రాజలింగం మాట్లాడుతూ డీటీసీపీ ఆమోదంతో, ప్రజలకు నచ్చే విధంగా హోమ్ డిజైన్స్తో ఇండ్లను అందిస్తున్నామని తెలిపారు. విశాలమైన రోడ్లు, పార్క్, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్, వీధి దీపాలు, కాంపౌండ్ వాల్తో పాటు 24 గంటల భద్రతా సౌకర్యం కల్పించామని చెప్పారు. సరసమైన ధరలకు ఇండ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో డైరెక్టర్స్ బొడ్డుపల్లి రమేష్, బొల్లెద్దు లింగయ్య, మామిడి శ్రవణ్, జిల్లపల్లి గణేష్, వంగూరి నగేష్, గుండ్లపల్లి సర్పంచ్ వంగూరి రమేష్, మాజీ ఎంపిటిసి ఇరిగి సహదేవ్, కార్తిక్ ,నల్గొండ మున్సిపల్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్,
స్థానిక ప్రజలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి