ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్
ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్
Editor Desk
నల్గొండ: పట్టణ కేంద్రంలోని ఎన్జీ కాలేజీ సమీపంలో ఉన్న “మన చద్దన్నం” న్యాచురల్ ఫుడ్ స్టాల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ జి. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీ లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ “మన చద్దన్నం” సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 50 స్టాళ్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థ సేవలను అభినందించారు. మిల్లెట్స్తో తయారయ్యే సద్దన్నం ఆహారం తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో “మన చద్దన్నం” వ్యవస్థాపకులు యోగా మాస్టర్, ప్రకృతి విశ్లేషకులు కె.వై. గిరి, కార్పొరేటర్ మల్లికార్జున్, జాతీయ ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత జర్నలిస్ట్ కంది భజరంగ్, పుల్లెంల శంకర్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి