Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 11:15 AM

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్
May 06, 2026 09:10 AM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: పట్టణ కేంద్రంలోని ఎన్‌జీ కాలేజీ సమీపంలో ఉన్న “మన చద్దన్నం” న్యాచురల్ ఫుడ్ స్టాల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ జి. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీ లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ “మన చద్దన్నం” సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 50 స్టాళ్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థ సేవలను అభినందించారు. మిల్లెట్స్‌తో తయారయ్యే సద్దన్నం ఆహారం తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో “మన చద్దన్నం” వ్యవస్థాపకులు యోగా మాస్టర్, ప్రకృతి విశ్లేషకులు కె.వై. గిరి, కార్పొరేటర్ మల్లికార్జున్, జాతీయ ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత జర్నలిస్ట్ కంది భజరంగ్, పుల్లెంల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News