Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:10 AM

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.
27-04-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం ఐకేపీ దాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్యతో కలిసి గ్రామంలో పోసిన దాన్యం రాశులను సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు పోసిన 74 దాన్యం కుప్పలకు ఇప్పటికీ కాంటాలు పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. మార్కెట్ ప్రారంభమై 15 రోజులు దాటినా రైస్ మిల్లులను కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని గుర్తు చేశారు.

వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నేబోయిన శ్రీనివాస్, నాయకులు రాదారపు మల్లేష్, బోనగిరి శ్రీనివాస్, అశోక్, సుర సత్తయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

Article Image

రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం ఐకేపీ దాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్యతో కలిసి గ్రామంలో పోసిన దాన్యం రాశులను సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు పోసిన 74 దాన్యం కుప్పలకు ఇప్పటికీ కాంటాలు పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. మార్కెట్ ప్రారంభమై 15 రోజులు దాటినా రైస్ మిల్లులను కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని గుర్తు చేశారు.

వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నేబోయిన శ్రీనివాస్, నాయకులు రాదారపు మల్లేష్, బోనగిరి శ్రీనివాస్, అశోక్, సుర సత్తయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News