Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:06 PM

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.
April 27, 2026 06:54 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం ఐకేపీ దాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్యతో కలిసి గ్రామంలో పోసిన దాన్యం రాశులను సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు పోసిన 74 దాన్యం కుప్పలకు ఇప్పటికీ కాంటాలు పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. మార్కెట్ ప్రారంభమై 15 రోజులు దాటినా రైస్ మిల్లులను కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని గుర్తు చేశారు.

వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నేబోయిన శ్రీనివాస్, నాయకులు రాదారపు మల్లేష్, బోనగిరి శ్రీనివాస్, అశోక్, సుర సత్తయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News