Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు మార్కెట్ రేటు పరిహారం ఇవ్వాలని సిపిఎం ధర్నా గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 08:48 PM

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.
April 27, 2026 06:54 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం ఐకేపీ దాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్యతో కలిసి గ్రామంలో పోసిన దాన్యం రాశులను సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు పోసిన 74 దాన్యం కుప్పలకు ఇప్పటికీ కాంటాలు పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. మార్కెట్ ప్రారంభమై 15 రోజులు దాటినా రైస్ మిల్లులను కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని గుర్తు చేశారు.

వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నేబోయిన శ్రీనివాస్, నాయకులు రాదారపు మల్లేష్, బోనగిరి శ్రీనివాస్, అశోక్, సుర సత్తయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News