దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..
దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..
NM Yadav
అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలి కలెక్టర్ బి. చంద్రశేఖర్..
నల్గొండ : ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులపై జిల్లా అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహించే సాధారణ ప్రజావాణిలో రద్దీ కారణంగా వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా నాలుగో శనివారం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకున్నారు. పెన్షన్లు, సహాయక పరికరాలు, భూ సమస్యలపై మొత్తం 74 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి సంబంధిత శాఖలకు బదిలీ చేసిన కలెక్టర్ నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావు నేత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి