Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 08:29 PM

దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..

దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..

దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..
March 28, 2026 06:54 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలి కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌..


​నల్గొండ : ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులపై జిల్లా అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహించే సాధారణ ప్రజావాణిలో రద్దీ కారణంగా వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా నాలుగో శనివారం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. పెన్షన్లు, సహాయక పరికరాలు, భూ సమస్యలపై మొత్తం 74 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి సంబంధిత శాఖలకు బదిలీ చేసిన కలెక్టర్ నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జె. శ్రీనివాస్‌, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నరసింహారావు నేత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News