చుక్క పద్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి
చుక్క పద్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి
Editor Desk
భువనగిరి రూరల్: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చుక్క శంకరమ్మ మృతి పట్ల భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే Pailla Shekar Reddy తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
మృతురాలు చుక్క రమేష్ (ఉపాధ్యాయుడు) తల్లి కాగా, నాగిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చుక్క పద్మయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు చుక్క స్వామిలకు చిన్నమ్మ అవుతారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
పరామర్శ కార్యక్రమంలో భువనగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి, భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు, తోక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, చందుపట్ల పీఏసీఎస్ చైర్మన్ బాల్గురి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, జిల్లా నాయకుడు ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.
అలాగే అనాజీపురం గ్రామశాఖ అధ్యక్షుడు బాత్క అశోక్, యువ నాయకులు పిన్నింటి మధుమోహన్ రెడ్డి, చుక్క శ్రావణ్, చుక్క సునీల్, చుక్క నరసింహ (కారోబార్), గ్రామ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి