PRINT TIME: July 03, 2026 07:51 PM
చివరి గింజ వరకు తూకాలు వేయిస్తాం : మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
చివరి గింజ వరకు తూకాలు వేయిస్తాం : మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
May 11, 2026 02:24 PM
123 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం రాశులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య సోమవారం పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు ధాన్యం తూకాలు వేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కావడానికి అవసరమైన అంశాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన తూకాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రతిపక్షాలు చేసే అనాలోచిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి