చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం
చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ధర్మ పరిరక్షణ లక్ష్యంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు... రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక శోభనం చిట్యాల సంతరించుకుంది కేవలం ధర్మ రక్షణ ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల ఆదరణ ఘనంగా లభించింది గత వారం రోజులుగా చిట్యాల మండలం వ్యాప్తంగా హిందూధర్మా విశిష్టతను చాటి చెబుతూ వివిధ కార్యక్రమాలను హిందూ సమ్మేళన సమితి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందుత్వాదులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక పురాతనమైన ధర్మాలలో హిందూ ధర్మం చాలా గొప్పదని, హిందూ ధర్మం పరిరక్షణ కోసం హిందువులందరూ ఏకం కావాలని ఈ సమయంలో పిలుపునిచ్చారు. హిందుత్వం అనేది వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గొప్ప సాంస్కృతి అని దీని ప్రాముఖ్యతను వివరించే కథలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే నినాదంతో హిందుత్వం మనుషులని ఏకం చేస్తుందని తెలిపారు ప్రకృతిని దైవంగా బంధువులుగా భావించే సంస్కృతి హిందుత్వంలో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పునాది యోగ ధ్యానం వేదాలు ఉపనిషత్తులు ద్వారా హైందవ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిపిన గొప్ప సాంస్కృతి అని తెలియజేశారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి