శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చేనేత శాఖ మంత్రి నియోజకవర్గంలో చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మండల సమితి ఆధ్వర్యంలో సోమందేపల్లి తహసీల్దార్కు గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులను గుర్తించి వెంటనే చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి