Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:56 AM

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు
May 01, 2026 05:30 PM 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

చౌటుప్పల్ మండల కేంద్రంలో సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయం ముందు జెండాను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినం కోసం చేసిన పోరాటం చరిత్రాత్మకమని తెలిపారు. ఆ నిరసనల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికుల త్యాగాల ఫలితంగానే ఎర్రజెండా పుట్టిందని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికుల పోరాటం మరింత బలపడిందని, 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారని అన్నారు.కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హమాలి, ఆటో, ట్రాన్స్‌పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాలు తీసుకురావాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లకు 60 ఏళ్లు దాటిన వారికి రూ.5,000 పెన్షన్ ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, పెన్షన్ వంటి హక్కులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం తంగేడుపల్లి రోడ్డులో సిపిఐ జెండాను పగిళ్ల మోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ ముందు ఏఐటీయూసీ జెండాను సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పాపగల శంకరయ్య ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, బద్దుల సుధాకర్, రొండీ నరసింహ, దాసరి అంజయ్య, నీల బిక్షపతి, రోషణ అంజయ్య, ఎస్.ఏ. రహమాన్, దాసరి కృష్ణ, వంటల వెంకటేష్, దాసరి మనోహర్, గుండెబోయిన నరసింహ, ఉబ్బు దర్శన్, కే. సైదులు, ఇరిగి సంజీవ, బి. యాదయ్య, ఏ. బాబు, దాసరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News