Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడు గాయాలు బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 06:57 PM

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు
May 01, 2026 05:30 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

చౌటుప్పల్ మండల కేంద్రంలో సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయం ముందు జెండాను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినం కోసం చేసిన పోరాటం చరిత్రాత్మకమని తెలిపారు. ఆ నిరసనల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికుల త్యాగాల ఫలితంగానే ఎర్రజెండా పుట్టిందని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికుల పోరాటం మరింత బలపడిందని, 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారని అన్నారు.కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హమాలి, ఆటో, ట్రాన్స్‌పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాలు తీసుకురావాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లకు 60 ఏళ్లు దాటిన వారికి రూ.5,000 పెన్షన్ ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, పెన్షన్ వంటి హక్కులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం తంగేడుపల్లి రోడ్డులో సిపిఐ జెండాను పగిళ్ల మోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ ముందు ఏఐటీయూసీ జెండాను సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పాపగల శంకరయ్య ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, బద్దుల సుధాకర్, రొండీ నరసింహ, దాసరి అంజయ్య, నీల బిక్షపతి, రోషణ అంజయ్య, ఎస్.ఏ. రహమాన్, దాసరి కృష్ణ, వంటల వెంకటేష్, దాసరి మనోహర్, గుండెబోయిన నరసింహ, ఉబ్బు దర్శన్, కే. సైదులు, ఇరిగి సంజీవ, బి. యాదయ్య, ఏ. బాబు, దాసరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News