Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:54 AM

చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు

చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు

చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు
May 04, 2026 09:14 PM 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బస్టాండ్‌ ఆవరణలో బాణాసంచా కాల్చి, మిఠాయిల పంపిణీ

పశ్చిమ బెంగాల్‌, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడటం పట్ల ఆ పార్టీ చౌటుప్పల్‌ మున్సిపల్‌, రూరల్‌ శాఖల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ బస్టాండ్‌ ఆవరణలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో భాజపా బలోపేతం కావడం దేశానికి ఎంతో అవసరమన్నారు. అదే ఉత్సాహంతో 2028 ఎన్నికల్లో తెలంగాణలోనూ భాజపా జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్, రూరల్ అధ్యక్షులు కైరం కొండ అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, రమణగోని శంకరయ్య, గుజ్జుల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, చినుకుని మల్లేశం, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పాలకూర్ల జంగయ్య, రెడ్డి బాయ్ సర్పంచ్ నందగిరి వెంకటేశం, కాట్రేవ్ సర్పంచ్ బోయ మహేంద్ర మనీ, కౌన్సిలర్లు పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, బుడ్డ సురేష్, ఉడుగు వెంకటేశం, బత్తుల జంగయ్య గౌడ్, ఉడుగు యాదయ్య గౌడ్, దాసోజు బిక్షమాచారి, గోషిక నీరజ, దిండు భాస్కర్, రాధారపు సత్తయ్య, కడారి ఐలయ్య, పబ్బతి శేఖర్, అమృతం దశరథ, కాసుల వెంకటేశం గౌడ్, వరగంటి భాను ప్రకాష్, కానుగు కొండల్, కాసోజు గోపి, బాలరత్నం, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News