చౌటుప్పల్లో భాజపా శ్రేణుల సంబరాలు
చౌటుప్పల్లో భాజపా శ్రేణుల సంబరాలు
K.RAVI
బస్టాండ్ ఆవరణలో బాణాసంచా కాల్చి, మిఠాయిల పంపిణీ
పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడటం పట్ల ఆ పార్టీ చౌటుప్పల్ మున్సిపల్, రూరల్ శాఖల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో భాజపా బలోపేతం కావడం దేశానికి ఎంతో అవసరమన్నారు. అదే ఉత్సాహంతో 2028 ఎన్నికల్లో తెలంగాణలోనూ భాజపా జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్, రూరల్ అధ్యక్షులు కైరం కొండ అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, రమణగోని శంకరయ్య, గుజ్జుల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, చినుకుని మల్లేశం, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పాలకూర్ల జంగయ్య, రెడ్డి బాయ్ సర్పంచ్ నందగిరి వెంకటేశం, కాట్రేవ్ సర్పంచ్ బోయ మహేంద్ర మనీ, కౌన్సిలర్లు పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, బుడ్డ సురేష్, ఉడుగు వెంకటేశం, బత్తుల జంగయ్య గౌడ్, ఉడుగు యాదయ్య గౌడ్, దాసోజు బిక్షమాచారి, గోషిక నీరజ, దిండు భాస్కర్, రాధారపు సత్తయ్య, కడారి ఐలయ్య, పబ్బతి శేఖర్, అమృతం దశరథ, కాసుల వెంకటేశం గౌడ్, వరగంటి భాను ప్రకాష్, కానుగు కొండల్, కాసోజు గోపి, బాలరత్నం, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి