చౌటుప్పల్లో ఐఎన్టీయూసీ 79వ ఆవిర్భావ వేడుకలు
చౌటుప్పల్లో ఐఎన్టీయూసీ 79వ ఆవిర్భావ వేడుకలు
K.RAVI
- రాజీవ్ స్మారక భవనంలో కేక్ కటింగ్
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
మండల కేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో ఆదివారం ఐఎన్టీయూసీ 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయ రామచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య మాట్లాడుతూ.. కార్మిక వర్గ సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ దశాబ్దాలుగా పోరాడుతోందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్, బ్లాక్ అధ్యక్షుడు కంచర్ల జంగయ్య, బ్లాక్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, మండల ప్రధాన కార్యదర్శి ఎండీ.చాంద్ పాషా, కాంగ్రెస్ మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, ప్రభుత్వ వైద్య అధికారి పాలడుగుల భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి