Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బెట్టింగ్ ఆడినా ఆడించినా కఠిన చర్యలు: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 08:32 PM

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి
April 29, 2026 07:08 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ.. నలుగురు సభ్యుల ఎన్నిక

పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం: చైర్‌పర్సన్‌ పావని రమేష్‌ గౌడ్

చౌటుప్పల్ పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.​ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి పర్యవేక్షణలో 13 మంది కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఈ ఎన్నిక నిర్వహించారు. నిబంధనల ప్రకారం వివిధ విభాగాల నుంచి నలుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.​ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు ప్రత్యేక పరిజ్ఞానం (జనరల్):పస్తం గంగారాములు,​ప్రత్యేక పరిజ్ఞానం (మహిళా విభాగం): సందగళ్ళ విజయ,​మైనారిటీ విభాగం (జనరల్): మహమ్మద్ బాబా షరీఫ్,​మైనారిటీ విభాగం (మహిళ): షేక్ నబీబి ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సభ్యులు పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, చౌటుప్పల్ పట్టణ ప్రగతికి, పౌర సేవల మెరుగుదలకు కౌన్సిల్ సభ్యులందరూ టీమ్ వర్క్‌తో పనిచేయాలని పిలుపునిచ్చారు.​అనంతరం ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News