Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:27 AM

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి
April 29, 2026 07:08 PM 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ.. నలుగురు సభ్యుల ఎన్నిక

పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం: చైర్‌పర్సన్‌ పావని రమేష్‌ గౌడ్

చౌటుప్పల్ పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.​ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి పర్యవేక్షణలో 13 మంది కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఈ ఎన్నిక నిర్వహించారు. నిబంధనల ప్రకారం వివిధ విభాగాల నుంచి నలుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.​ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు ప్రత్యేక పరిజ్ఞానం (జనరల్):పస్తం గంగారాములు,​ప్రత్యేక పరిజ్ఞానం (మహిళా విభాగం): సందగళ్ళ విజయ,​మైనారిటీ విభాగం (జనరల్): మహమ్మద్ బాబా షరీఫ్,​మైనారిటీ విభాగం (మహిళ): షేక్ నబీబి ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సభ్యులు పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, చౌటుప్పల్ పట్టణ ప్రగతికి, పౌర సేవల మెరుగుదలకు కౌన్సిల్ సభ్యులందరూ టీమ్ వర్క్‌తో పనిచేయాలని పిలుపునిచ్చారు.​అనంతరం ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News