చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
K.RAVI
నలుగురు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన కమిషనర్
'చౌటుప్పల్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం'
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని సభ్యులను ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 10 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా, 12 మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికైన నలుగురు సభ్యులకు సభలోని సభ్యులందరూ పూర్తి మద్దతు ప్రకటించారు.
ఎన్నికైన సభ్యులు వీరే:
పర్సం గంగారం, సందగళ్ల విజయ సతీష్, బాబా షరీఫ్, షేక్ నబీబి, జానీ బాబా ఎన్నికల ప్రక్రియ అనంతరం మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా టీమ్ వర్క్ తో పనిచేస్తేనే చౌటుప్పల్ను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా వెనుకబడిన వార్డులపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి విషయంలో నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను, ఏ సమస్య ఉన్నా నేరుగా చర్చించవచ్చు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి