Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:26 AM

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక
April 29, 2026 06:07 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నలుగురు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన కమిషనర్

'చౌటుప్పల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం'

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని సభ్యులను ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 10 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా, 12 మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికైన నలుగురు సభ్యులకు సభలోని సభ్యులందరూ పూర్తి మద్దతు ప్రకటించారు.


ఎన్నికైన సభ్యులు వీరే:

పర్సం గంగారం,​ సందగళ్ల విజయ సతీష్,​ బాబా షరీఫ్,​ షేక్ నబీబి, జానీ బాబా ​ఎన్నికల ప్రక్రియ అనంతరం మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి​ మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా టీమ్ వర్క్ తో పనిచేస్తేనే చౌటుప్పల్‌ను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా వెనుకబడిన వార్డులపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి విషయంలో నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను, ఏ సమస్య ఉన్నా నేరుగా చర్చించవచ్చు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News