Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:07 AM

చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ బాధ్యతల స్వీకరణ

చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ బాధ్యతల స్వీకరణ

చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ బాధ్యతల స్వీకరణ
02-05-2026 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురపాలక కార్యాలయంలో సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్ మున్సిపల్ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..​పట్టణ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.​ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.తొలిరోజు విధుల్లో చేరిన కమిషనర్‌ను మున్సిపల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి, పర్యావరణ హితంగా మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య పరిస్థితులపై చైర్ పర్సన్‌తో ఆయన ప్రాథమికంగా చర్చించారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ బాధ్యతల స్వీకరణ

Article Image

చౌటుప్పల్ పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురపాలక కార్యాలయంలో సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్ మున్సిపల్ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..​పట్టణ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.​ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.తొలిరోజు విధుల్లో చేరిన కమిషనర్‌ను మున్సిపల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి, పర్యావరణ హితంగా మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య పరిస్థితులపై చైర్ పర్సన్‌తో ఆయన ప్రాథమికంగా చర్చించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News