చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్గా వేంకటేశ్వర నాయక్ బాధ్యతల స్వీకరణ
చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్గా వేంకటేశ్వర నాయక్ బాధ్యతల స్వీకరణ
K.RAVI
చౌటుప్పల్ పురపాలక సంఘం నూతన కమిషనర్గా వేంకటేశ్వర నాయక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురపాలక కార్యాలయంలో సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్ మున్సిపల్ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టణ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.తొలిరోజు విధుల్లో చేరిన కమిషనర్ను మున్సిపల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి, పర్యావరణ హితంగా మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య పరిస్థితులపై చైర్ పర్సన్తో ఆయన ప్రాథమికంగా చర్చించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి