Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:54 PM

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి
May 05, 2026 05:46 PM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ వినతి


​* చిరు వ్యాపారుల ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డు సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని 5వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మార్కెట్ సౌకర్యం లేక చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మించిన మార్కెట్ భవనానికి చిన్నపాటి మరమ్మతులు చేపట్టి, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి వెంటనే వ్యాపారులకు కేటాయించాలి. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనుల వల్ల చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ గేటు ముందు నుంచి వెనుక భాగం మీదుగా గ్రంథాలయం, మున్సిపల్ కార్యాలయం వరకు తాత్కాలికంగా రోడ్డు సౌకర్యం కల్పించాలి.​"మార్కెట్ వెనుక భాగం నుంచి రోడ్డు సౌకర్యం కల్పిస్తే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. దీనివల్ల జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గి, ప్రజలు సులువుగా మార్కెట్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టాలి." కొయ్యడ శేఖర్ గౌడ్

​ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News