Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:03 AM

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి
05-05-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ వినతి


​* చిరు వ్యాపారుల ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డు సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని 5వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మార్కెట్ సౌకర్యం లేక చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మించిన మార్కెట్ భవనానికి చిన్నపాటి మరమ్మతులు చేపట్టి, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి వెంటనే వ్యాపారులకు కేటాయించాలి. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనుల వల్ల చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ గేటు ముందు నుంచి వెనుక భాగం మీదుగా గ్రంథాలయం, మున్సిపల్ కార్యాలయం వరకు తాత్కాలికంగా రోడ్డు సౌకర్యం కల్పించాలి.​"మార్కెట్ వెనుక భాగం నుంచి రోడ్డు సౌకర్యం కల్పిస్తే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. దీనివల్ల జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గి, ప్రజలు సులువుగా మార్కెట్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టాలి." కొయ్యడ శేఖర్ గౌడ్

​ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

Article Image

​* మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ వినతి


​* చిరు వ్యాపారుల ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డు సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని 5వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మార్కెట్ సౌకర్యం లేక చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మించిన మార్కెట్ భవనానికి చిన్నపాటి మరమ్మతులు చేపట్టి, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి వెంటనే వ్యాపారులకు కేటాయించాలి. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనుల వల్ల చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ గేటు ముందు నుంచి వెనుక భాగం మీదుగా గ్రంథాలయం, మున్సిపల్ కార్యాలయం వరకు తాత్కాలికంగా రోడ్డు సౌకర్యం కల్పించాలి.​"మార్కెట్ వెనుక భాగం నుంచి రోడ్డు సౌకర్యం కల్పిస్తే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. దీనివల్ల జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గి, ప్రజలు సులువుగా మార్కెట్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టాలి." కొయ్యడ శేఖర్ గౌడ్

​ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News