Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోధి స్కూల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం – ప్రజలకు చల్లని తాగునీటి సేవ సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 07:38 PM

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి
May 05, 2026 05:46 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ వినతి


​* చిరు వ్యాపారుల ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డు సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని 5వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మార్కెట్ సౌకర్యం లేక చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మించిన మార్కెట్ భవనానికి చిన్నపాటి మరమ్మతులు చేపట్టి, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి వెంటనే వ్యాపారులకు కేటాయించాలి. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనుల వల్ల చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ గేటు ముందు నుంచి వెనుక భాగం మీదుగా గ్రంథాలయం, మున్సిపల్ కార్యాలయం వరకు తాత్కాలికంగా రోడ్డు సౌకర్యం కల్పించాలి.​"మార్కెట్ వెనుక భాగం నుంచి రోడ్డు సౌకర్యం కల్పిస్తే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. దీనివల్ల జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గి, ప్రజలు సులువుగా మార్కెట్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టాలి." కొయ్యడ శేఖర్ గౌడ్

​ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News