Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 08:51 PM

చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్..

చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్..

 చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్..
April 27, 2026 06:31 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

అక్రమ దత్తతకు పాల్పడితే కఠిన చర్యలు..

​కలెక్టరేట్‌లో దత్తత అవగాహన హెల్ప్ డెస్క్ ప్రారంభం, మే 2 వరకు సంక్షేమ వారోత్సవాలు..


నల్గొండ : పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ నెల 27 నుండి మే 2 వరకు బాలల భద్రత, రక్షణ మరియు 'మత్తు పదార్థాలకు నో చెప్పండి' అనే అంశాలపై నిర్వహిస్తున్న వారోత్సవాల వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... సంతానం లేని వారు లేదా పిల్లలను పెంచుకోవాలనుకునే వారు తప్పనిసరిగా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి చట్టపరమైన విధానాలను మాత్రమే అనుసరించాలని సూచించారు. ఎవరైనా మధ్యవర్తుల ద్వారా అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుంటే శిక్ష తప్పదని స్పష్టం చేశారు. దత్తత ప్రక్రియపై పూర్తి సమాచారం కోసం నల్గొండలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో ఉన్న బాలరక్ష భవన్‌ను లేదా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా దత్తతపై అవగాహన పెంచేందుకు కలెక్టరేట్‌తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్, చిట్యాల, నాగార్జునసాగర్, చండూరు వంటి ప్రధాన పట్టణాల్లో జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు చురుగ్గా పని చేస్తూ ప్రజలకు చట్టబద్ధమైన దత్తతపై వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కో-ఆర్డినేటర్ బి. మహేశ్, బాలసదనం మరియు శిశుగృహ సిబ్బంది హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News