స్థానికం ప్రతినిధి
నూతన సంవత్సరం సందర్భంగా నకిరేకల్ మాజీ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలోబీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు జాల అమరనాథ్ రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు సయ్యద్ ఖదీర్తో పాటు బాసాని రాజు, ముసాబ్ ఒమైర్, బోయపల్లి భరత్, చిత్రకంటి శివశంకర్, గాదె నరేష్, బాసాని సతీష్, గొర్ల నర్సింగరావు, గాదె చందు, దామెర బన్ని తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల సంక్షేమం, నియోజకవర్గ పురోగతే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి