Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 11:26 PM

చెడు వ్యసనాలు వీడండి చదువుపై దృష్టి పెట్టండి!​

చెడు వ్యసనాలు వీడండి చదువుపై దృష్టి పెట్టండి!​

చెడు వ్యసనాలు వీడండి చదువుపై దృష్టి పెట్టండి!​
March 26, 2026 09:51 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

మైనర్ బాలురు తల్లిదండ్రులకు ఎస్ఐ వై. సైదులు కౌన్సిలింగ్..

అభినవ్ స్టేడియం సమీపంలో పట్టుబడ్డ వైనం..

నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు సూచన..

నల్గొండ : మైనర్ బాలురు దురలవాట్లకు లోనై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నల్గొండ టూ టౌన్ ఎస్ఐ వై. సైదులు హితవు పలికారు. పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియం సమీపంలో కొంతమంది మైనర్లు సిగరెట్లు సేవిస్తూ చెడు మార్గంలో వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టుబడ్డ బాలురకు, వారి తల్లిదండ్రులకు స్టేషన్‌లో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. స్టేడియం పరిసరాల్లో మైనర్లు సిగరెట్లు సేవిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు తనిఖీలు చేపట్టారు. అక్కడ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బాలురను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి ఎస్ఐ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.

భవిష్యత్తుపై అవగాహన..

​ఈ సందర్భంగా ఎస్ఐ సైదులు మాట్లాడుతూ.. చిన్న వయసులో సరదాగా మొదలయ్యే అలవాట్లు వ్యసనాలుగా మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశలో చదువుపై ఏకాగ్రత వహించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. స్నేహితుల ప్రభావంతో తప్పుడు మార్గంలో వెళ్తే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది అని బాలురను హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం కన్నేసి ఉంచాలని ఎస్ఐ సూచించారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? అనే విషయాలను గమనించాలన్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. చిన్నపిల్లలకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించే దుకాణదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు. పట్టణంలో ఎక్కడైనా మైనర్లు చెడు అలవాట్లకు లోనవుతున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఆరోగ్యకరమైన, నేరరహిత సమాజ స్థాపనే పోలీసుల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News