వ్యాపారంలో ముందుకు – వెస్టీజ్ డైరెక్టర్ సెల్లింగ్ మార్గదర్శనం
వ్యాపారంలో ముందుకు – వెస్టీజ్ డైరెక్టర్ సెల్లింగ్ మార్గదర్శనం
Krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్చూరు నియోజకవర్గంలో గురువారం “విన్నింగ్ టీం” ఆధ్వర్యంలో వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ డైరెక్టర్ సెల్లింగ్పై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ డి.యు.సి.డి డైరెక్టర్ (వి.ఎమ్.సీ.ఎమ్ మెంబర్) సలీం హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో పర్చూరు నియోజకవర్గం నుండి వచ్చిన డి.యు.సి.డి డైరెక్టర్లు, యుసిడి, గ్రౌండ్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు మరియు వెస్టీజ్ మార్కెటింగ్ సభ్యులు కలిసి సలీంను పుష్పగుచ్చాలతో ఘనంగా సుస్వాగతం పలికారు.అనంతరం సలీం మాట్లాడుతూ, వెస్టీజ్ మార్కెటింగ్ డైరెక్టర్ సెల్లింగ్ వ్యవస్థ ద్వారా అనేక మంది యువతకు మరియు వ్యాపార ఆసక్తి ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని, సరైన విధంగా శిక్షణ తీసుకుని కృషి చేస్తే ఈ రంగంలో మంచి స్థాయి సాధించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న డైరెక్టర్ల ఉత్సాహం అభినందనీయమని ఆయన అన్నారు.ఈ సందర్భంగా స్థానిక పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు బాపట్ల పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు వెస్టీజ్ మార్కెటింగ్ స్టోర్ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, వెస్టీజ్ మార్కెటింగ్ డైరెక్టర్ సెల్లింగ్ గురించి గతంలో వినడమే గానీ, ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తే ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార విధానమని తెలిసిందని తెలిపారు. ప్రజల్లో ఇంత విస్తృతంగా ఆదరణ పొందుతున్న ఈ బిజినెస్పై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, తాను కూడా ప్రోడక్ట్ను స్వయంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు.మొత్తం మీద ఈ అవగాహన కార్యక్రమం ద్వారా వెస్టీజ్ మార్కెటింగ్ వ్యాపార అవకాశాలపై పాల్గొన్న వారికి స్పష్టమైన అవగాహన కలిగి, వ్యాపార విస్తరణకు ఇది ఉపయోగపడే విధంగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి