Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:13 PM

వ్యాపారంలో ముందుకు – వెస్టీజ్ డైరెక్టర్ సెల్లింగ్ మార్గదర్శనం

వ్యాపారంలో ముందుకు – వెస్టీజ్ డైరెక్టర్ సెల్లింగ్ మార్గదర్శనం

వ్యాపారంలో ముందుకు – వెస్టీజ్ డైరెక్టర్ సెల్లింగ్ మార్గదర్శనం
April 03, 2026 03:17 PM 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్చూరు నియోజకవర్గంలో గురువారం “విన్నింగ్ టీం” ఆధ్వర్యంలో వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ డైరెక్టర్ సెల్లింగ్‌పై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ డి.యు.సి.డి డైరెక్టర్ (వి.ఎమ్.సీ.ఎమ్ మెంబర్) సలీం హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో పర్చూరు నియోజకవర్గం నుండి వచ్చిన డి.యు.సి.డి డైరెక్టర్లు, యుసిడి, గ్రౌండ్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు మరియు వెస్టీజ్ మార్కెటింగ్ సభ్యులు కలిసి సలీంను పుష్పగుచ్చాలతో ఘనంగా సుస్వాగతం పలికారు.అనంతరం సలీం మాట్లాడుతూ, వెస్టీజ్ మార్కెటింగ్ డైరెక్టర్ సెల్లింగ్ వ్యవస్థ ద్వారా అనేక మంది యువతకు మరియు వ్యాపార ఆసక్తి ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని, సరైన విధంగా శిక్షణ తీసుకుని కృషి చేస్తే ఈ రంగంలో మంచి స్థాయి సాధించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న డైరెక్టర్ల ఉత్సాహం అభినందనీయమని ఆయన అన్నారు.ఈ సందర్భంగా స్థానిక పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు బాపట్ల పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు వెస్టీజ్ మార్కెటింగ్ స్టోర్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, వెస్టీజ్ మార్కెటింగ్ డైరెక్టర్ సెల్లింగ్ గురించి గతంలో వినడమే గానీ, ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తే ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార విధానమని తెలిసిందని తెలిపారు. ప్రజల్లో ఇంత విస్తృతంగా ఆదరణ పొందుతున్న ఈ బిజినెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, తాను కూడా ప్రోడక్ట్‌ను స్వయంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు.మొత్తం మీద ఈ అవగాహన కార్యక్రమం ద్వారా వెస్టీజ్ మార్కెటింగ్ వ్యాపార అవకాశాలపై పాల్గొన్న వారికి స్పష్టమైన అవగాహన కలిగి, వ్యాపార విస్తరణకు ఇది ఉపయోగపడే విధంగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News