బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష
బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష
Editor Desk
బోరు మోటర్ వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రామన్నపేట కోర్టు తీర్పు వెలువరించింది.
రామన్నపేట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నం. 28/2019 (ఐపీసీ 326, 504) కేసును విచారించిన ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. శిరీష మంగళవారం తీర్పు ప్రకటించారు. రామన్నపేట మండలంలోని
కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల మహేష్ (లచ్చయ్య కుమారుడు)ను నిందితుడిగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. బోరు మోటర్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఈ కేసు నమోదైంది.
సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిపై ఆరోపణలు రుజువైనట్లు తేల్చింది.
ఈ కేసు విచారణలో నిందితునికి శిక్ష పడేందుకు ఏపీపి ఖాజా నిజాముద్దీన్, కోర్టు సిబ్బంది వి. రాంబాబు, సత్యనారాయణ, రామన్నపేట ఎస్ ఐ డి నాగరాజు తదితరులు సహకరించినారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి