Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్ రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 09:32 PM

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష
April 28, 2026 07:42 PM 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరు మోటర్ వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రామన్నపేట కోర్టు తీర్పు వెలువరించింది.

రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నం. 28/2019 (ఐపీసీ 326, 504) కేసును విచారించిన ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. శిరీష మంగళవారం తీర్పు ప్రకటించారు. రామన్నపేట మండలంలోని

కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల మహేష్ (లచ్చయ్య కుమారుడు)ను నిందితుడిగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. బోరు మోటర్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఈ కేసు నమోదైంది.

సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిపై ఆరోపణలు రుజువైనట్లు తేల్చింది.

ఈ కేసు విచారణలో నిందితునికి శిక్ష పడేందుకు ఏపీపి ఖాజా నిజాముద్దీన్, కోర్టు సిబ్బంది వి. రాంబాబు, సత్యనారాయణ, రామన్నపేట ఎస్ ఐ డి నాగరాజు తదితరులు సహకరించినారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News