Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:08 AM

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష
28-04-2026 249 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరు మోటర్ వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రామన్నపేట కోర్టు తీర్పు వెలువరించింది.

రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నం. 28/2019 (ఐపీసీ 326, 504) కేసును విచారించిన ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. శిరీష మంగళవారం తీర్పు ప్రకటించారు. రామన్నపేట మండలంలోని

కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల మహేష్ (లచ్చయ్య కుమారుడు)ను నిందితుడిగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. బోరు మోటర్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఈ కేసు నమోదైంది.

సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిపై ఆరోపణలు రుజువైనట్లు తేల్చింది.

ఈ కేసు విచారణలో నిందితునికి శిక్ష పడేందుకు ఏపీపి ఖాజా నిజాముద్దీన్, కోర్టు సిబ్బంది వి. రాంబాబు, సత్యనారాయణ, రామన్నపేట ఎస్ ఐ డి నాగరాజు తదితరులు సహకరించినారు

Sthanikam

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష

Article Image

బోరు మోటర్ వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రామన్నపేట కోర్టు తీర్పు వెలువరించింది.

రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నం. 28/2019 (ఐపీసీ 326, 504) కేసును విచారించిన ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. శిరీష మంగళవారం తీర్పు ప్రకటించారు. రామన్నపేట మండలంలోని

కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల మహేష్ (లచ్చయ్య కుమారుడు)ను నిందితుడిగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. బోరు మోటర్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఈ కేసు నమోదైంది.

సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిపై ఆరోపణలు రుజువైనట్లు తేల్చింది.

ఈ కేసు విచారణలో నిందితునికి శిక్ష పడేందుకు ఏపీపి ఖాజా నిజాముద్దీన్, కోర్టు సిబ్బంది వి. రాంబాబు, సత్యనారాయణ, రామన్నపేట ఎస్ ఐ డి నాగరాజు తదితరులు సహకరించినారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News