బోగారం లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
బోగారం లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
Editor Desk
: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్, రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధ్యపురి పద్మయ్య, బద్దల ఉమా రమేష్ యాదవ్, మేడి రామలింగం, బైకానిక్ ఉమా మహేష్ యాదవ్, గోగు ప్రమీల రమేష్, మేడి ఆంజనేయులు, నేరటి మానస, సురేష్ యాదవ్, కడారి పావని, కోడి పాండు, చల్ల మల్ల నర్సిరెడ్డి, చెరుకు సత్తయ్య గౌడ్, గుర్రం బిక్షపతి, చెరుకు శంకరయ్య, బొడ్డుపల్లి రాజు, వనం నరసింహ, కడారి మల్లేశం, గండూరి వెంకటేశ్వర్లు, గోగు శ్రీనివాస్ యాదవ్, వనం సిద్దేశ్వర్, బద్దుల కుమార్, ఏర్పల కిరణ్, గుర్రం ముత్తయ్య, కోనూరు మల్లేష్, కూనూరు శ్రీకాంత్ గౌడ్, కడారి లక్ష్మణ్, చెరుకు రాజు గౌడ్, మేడి నరసింహ, గుంజే ఆంజనేయులు, గుంజే మహేష్, గుంజే శివ, మేడి రవీందర్, మేడి శంకరయ్య, మెట్టు అంజయ్య, మధ్యపురి ఐలయ్య, దగడు వెంకట్, మేడి నవీన్, బడుగు శివ, మేడి అశోక్, మేడి మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి