Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:13 AM

బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్‌ఐ

బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్‌ఐ

బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్‌ఐ
11-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు మారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు.

సోమవారం నల్గొండ జిల్లా కార్యాలయంలో జరిగిన డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీలకు చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు నేరాలకు పాల్పడినా ప్రభుత్వం, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

చట్టం అందరికీ సమానమైతే నిందితుడిపై వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగేలా వేగవంతమైన విచారణ చేపట్టాలని కోరారు. మహిళల భద్రతపై పెద్ద ఎత్తున మాట్లాడే పాలకులు ఇలాంటి ఘటనల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

బాధితులను భయపెట్టి నిందితులను కాపాడే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా యువజనులు, ప్రజాసంఘాలు ఈ ఘటనపై స్పందించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా నాయకులు పోకల శశిధర్, అంజి, కార్తీక్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్‌ఐ

Article Image

నల్గొండ టౌన్: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు మారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు.

సోమవారం నల్గొండ జిల్లా కార్యాలయంలో జరిగిన డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీలకు చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు నేరాలకు పాల్పడినా ప్రభుత్వం, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

చట్టం అందరికీ సమానమైతే నిందితుడిపై వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగేలా వేగవంతమైన విచారణ చేపట్టాలని కోరారు. మహిళల భద్రతపై పెద్ద ఎత్తున మాట్లాడే పాలకులు ఇలాంటి ఘటనల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

బాధితులను భయపెట్టి నిందితులను కాపాడే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా యువజనులు, ప్రజాసంఘాలు ఈ ఘటనపై స్పందించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా నాయకులు పోకల శశిధర్, అంజి, కార్తీక్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News