భువనగిరి,
పౌరసరఫరాల శాఖ అధికారులు భువనగిరి పట్టణంలో పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా అక్రమంగా వినియోగిస్తున్న 7 గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.
సహాయ పౌరసరఫరాల అధికారి సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్లు నర్సింగ్ రావు, ఇన్స్పెక్టర్లు విజయసింహ రెడ్డి, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు వ్యాపార కేంద్రాల్లో తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే ఉపయోగించాలని, గృహ వినియోగ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి