భువనగిరిలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.
భువనగిరిలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.
Editor Desk
భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడని అన్నారు. చిన్ననాటి నుండి అనేక కష్టాలు, వివక్షలు ఎదుర్కొన్నప్పటికీ విద్యపై ఆసక్తిని కోల్పోకుండా ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి మార్గదర్శకుడయ్యారని పేర్కొన్నారు. విద్య, సామాజిక చైతన్యం ద్వారానే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమని స్పష్టం చేశారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని, యువత విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని తెలిపారు. ఆయన ఆశయాలను అనుసరిస్తూ సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ వాణి, వైస్ చైర్మన్ మంజుల, ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సంఘ నాయకులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి