Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా గుట్టురట్టు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 01:52 PM

భువనగిరిలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.

భువనగిరిలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.

భువనగిరిలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.
April 14, 2026 04:52 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడని అన్నారు. చిన్ననాటి నుండి అనేక కష్టాలు, వివక్షలు ఎదుర్కొన్నప్పటికీ విద్యపై ఆసక్తిని కోల్పోకుండా ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి మార్గదర్శకుడయ్యారని పేర్కొన్నారు. విద్య, సామాజిక చైతన్యం ద్వారానే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమని స్పష్టం చేశారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని, యువత విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని తెలిపారు. ఆయన ఆశయాలను అనుసరిస్తూ సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితి, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీ వాణి, వైస్ చైర్మన్ మంజుల, ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సంఘ నాయకులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News