భువనగిరి కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగపల్లి శ్రీవాణి రవికుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, సౌభ్రాతృత్వానికి ఈ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు.
ఉదయం నుంచే ముస్లింలు ఈద్గా వద్దకు భారీగా చేరుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి