Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:12 AM

భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి దేవాదాయ కమిషనర్‌కు వినతి

భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి దేవాదాయ కమిషనర్‌కు వినతి

భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి దేవాదాయ కమిషనర్‌కు వినతి
04-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.

దేవస్థానం పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కొండ వెనుక భాగంలోని తమ భూములను ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పగించినట్టు వారు తెలిపారు. ఆ సమయంలో దుకాణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా అవి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములకు పరిహారం అందించినప్పటికీ జీవనోపాధి కోల్పోయామని పేర్కొన్నారు.

ప్రస్తుతం అనేక మంది రైతులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారని, కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, అన్నదాన సముదాయం, పార్కింగ్ స్థలాలు వంటి నిర్మాణాలు చేపట్టినా భూ నిర్వాసితులకు మాత్రం సరైన ప్రయోజనం కలగలేదని అన్నారు.

ఇప్పటికైనా తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నివాస స్థలాలు, దుకాణాల కేటాయింపు లేదా దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేకపోతే తమ కుటుంబాల జీవనం మరింత కష్టాల్లో పడుతుందని హెచ్చరించారు.

Sthanikam

భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి దేవాదాయ కమిషనర్‌కు వినతి

Article Image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.

దేవస్థానం పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కొండ వెనుక భాగంలోని తమ భూములను ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పగించినట్టు వారు తెలిపారు. ఆ సమయంలో దుకాణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా అవి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములకు పరిహారం అందించినప్పటికీ జీవనోపాధి కోల్పోయామని పేర్కొన్నారు.

ప్రస్తుతం అనేక మంది రైతులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారని, కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, అన్నదాన సముదాయం, పార్కింగ్ స్థలాలు వంటి నిర్మాణాలు చేపట్టినా భూ నిర్వాసితులకు మాత్రం సరైన ప్రయోజనం కలగలేదని అన్నారు.

ఇప్పటికైనా తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నివాస స్థలాలు, దుకాణాల కేటాయింపు లేదా దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేకపోతే తమ కుటుంబాల జీవనం మరింత కష్టాల్లో పడుతుందని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News