భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి దేవాదాయ కమిషనర్కు వినతి
భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి దేవాదాయ కమిషనర్కు వినతి
Editor Desk
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు.
దేవస్థానం పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కొండ వెనుక భాగంలోని తమ భూములను ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పగించినట్టు వారు తెలిపారు. ఆ సమయంలో దుకాణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా అవి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములకు పరిహారం అందించినప్పటికీ జీవనోపాధి కోల్పోయామని పేర్కొన్నారు.
ప్రస్తుతం అనేక మంది రైతులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారని, కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, అన్నదాన సముదాయం, పార్కింగ్ స్థలాలు వంటి నిర్మాణాలు చేపట్టినా భూ నిర్వాసితులకు మాత్రం సరైన ప్రయోజనం కలగలేదని అన్నారు.
ఇప్పటికైనా తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నివాస స్థలాలు, దుకాణాల కేటాయింపు లేదా దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేకపోతే తమ కుటుంబాల జీవనం మరింత కష్టాల్లో పడుతుందని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి