భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,3 వార్డు అభ్యర్థులు నామినేషన్ దాఖలు
భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,3 వార్డు అభ్యర్థులు నామినేషన్ దాఖలు
K.RAVI
2వ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ -ముత్తయ్య
3వ వార్డు అభ్యర్థిగా రమణ గోని దీపిక -శంకరయ్య
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కత్తుల రవి
భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 20 వార్డులకు గాను రెండవ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, మూడో వార్డు అభ్యర్థిగా రమణ గోని దీపిక శంకరయ్య భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి మూడో వార్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పెద్ద ఎత్తున ప్రజల తోటి ర్యాలీగా బయలుదేరి చౌటుప్పల రామాలయం లోని శ్రీరాముడు ఆశీస్సులు తీసుకొని సుమారు 500 మంది మహిళా మణులతో కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేసినారు. వివిధ వార్డుల్లో బిజెపి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, రమణ గోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, సురేందర్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, దాసోజు బిక్షమాచారి,తడక సురేఖ గోశిక, నీరజ, వనం ధనంజయ, కడారి ఐలయ్య, ఎడ్ల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి