Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 01:30 AM

బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం.  జాజుల శ్రీనివాస్ గౌడ్
April 29, 2026 08:38 AM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పట్టణంలోని బీసీ నాయకుడు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జాతి జనగణనలో బీసీ కుటుంబాలను చేర్చకపోవడం బీసీలకు చేసిన మోసమని ఆరోపించారు. కేంద్రం రూపొందించిన ప్రశ్నావళిలో బీసీ వివరాలకు చోటు కల్పించకపోవడం అన్యాయమన్నారు. బీసీల లెక్కలు లేకుండా జరిగే జనగణన వల్ల వారికి ప్రయోజనం ఉండదని ప్రశ్నించారు.

బీజేపీ నిర్వహిస్తున్న మహిళా అగ్రహ సభలు వాస్తవానికి బీసీలకు ద్రోహ సభలేనని విమర్శించారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ఉపకోటా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ బిల్లుతో అగ్రకులాలకే అధికారం కేంద్రీకృతమవుతుందని, బీసీ మహిళలకు న్యాయం జరగదని తెలిపారు.

దేశంలో కోట్లాది బీసీ మహిళల ఆకాంక్షలను విస్మరించి కొద్దిమంది ప్రయోజనాల కోసం బిల్లు తీసుకురావడాన్ని సహించబోమన్నారు. బీసీ డిమాండ్ల సాధన కోసం గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సుంకరి మల్లేష్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జెల్లా ఆదినారాయణ, హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News