Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 10:29 AM

బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం.  జాజుల శ్రీనివాస్ గౌడ్
April 29, 2026 08:38 AM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పట్టణంలోని బీసీ నాయకుడు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జాతి జనగణనలో బీసీ కుటుంబాలను చేర్చకపోవడం బీసీలకు చేసిన మోసమని ఆరోపించారు. కేంద్రం రూపొందించిన ప్రశ్నావళిలో బీసీ వివరాలకు చోటు కల్పించకపోవడం అన్యాయమన్నారు. బీసీల లెక్కలు లేకుండా జరిగే జనగణన వల్ల వారికి ప్రయోజనం ఉండదని ప్రశ్నించారు.

బీజేపీ నిర్వహిస్తున్న మహిళా అగ్రహ సభలు వాస్తవానికి బీసీలకు ద్రోహ సభలేనని విమర్శించారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ఉపకోటా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ బిల్లుతో అగ్రకులాలకే అధికారం కేంద్రీకృతమవుతుందని, బీసీ మహిళలకు న్యాయం జరగదని తెలిపారు.

దేశంలో కోట్లాది బీసీ మహిళల ఆకాంక్షలను విస్మరించి కొద్దిమంది ప్రయోజనాల కోసం బిల్లు తీసుకురావడాన్ని సహించబోమన్నారు. బీసీ డిమాండ్ల సాధన కోసం గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సుంకరి మల్లేష్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జెల్లా ఆదినారాయణ, హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News