Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:31 PM

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత
03-05-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-సాయి గూడెంలో ఘనంగా మేడే వేడుకలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్‌లు కార్మికులను యాజమాన్యాల ముందు బానిసలుగా మార్చడానికే దోహదపడుతున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు విమర్శించారు.ఆలేరు మండల పరిధిలోని సాయి గూడెంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 140వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను గ్రామ కమిటీ కార్యదర్శి కొమ్మిడి గోపాల్ రెడ్డి ఎగురవేశారు.చికాగో అమర వీరులకు నివాళులు అర్పిస్తూ విప్లవ జోహార్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్,ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్,ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్ మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని దినం,ఓటు హక్కు,సమానత్వం కోసం చేసిన పోరాటం ఫలితంగా అనేక కార్మిక హక్కులు సాధించారని పేర్కొన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయని,ఇప్పటికే సాధించిన చట్టాలను బలహీనపరిచే ప్రయత్నమని విమర్శించారు.కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరింత పట్టుదలతో పోరాడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు శిఖిలం కుమారస్వామి,ఎలగందుల సిద్దులు,ఇక్కిరి శ్రీనివాస్,ఆర్.ఉదయ్‌తో పాటు పార్టీ జిల్లా,డివిజన్,గ్రామ నాయకులు ఆర్.సీత,చిరబోయిన కొమురయ్య, మారుజోడు సిద్దేశ్వర్,తమ్మడి అంజయ్య,డొంకెన శ్రీహరి,తమ్మడి రమేష్,గోవింద్ పరమేష్,కొమ్మిడి శ్రీకాంత్ రెడ్డి,కుర్రి మార్కండేయ,దార యాదగిరి,కడకంచి సత్యనారాయణ,కడకంచి రమేష్,మేకల వెంకటేష్,బైరి చంద్రయ్య,కొమ్మిడి నర్సింహారెడ్డి,కడకంచి మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత

Article Image

-సాయి గూడెంలో ఘనంగా మేడే వేడుకలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్‌లు కార్మికులను యాజమాన్యాల ముందు బానిసలుగా మార్చడానికే దోహదపడుతున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు విమర్శించారు.ఆలేరు మండల పరిధిలోని సాయి గూడెంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 140వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను గ్రామ కమిటీ కార్యదర్శి కొమ్మిడి గోపాల్ రెడ్డి ఎగురవేశారు.చికాగో అమర వీరులకు నివాళులు అర్పిస్తూ విప్లవ జోహార్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్,ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్,ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్ మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని దినం,ఓటు హక్కు,సమానత్వం కోసం చేసిన పోరాటం ఫలితంగా అనేక కార్మిక హక్కులు సాధించారని పేర్కొన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయని,ఇప్పటికే సాధించిన చట్టాలను బలహీనపరిచే ప్రయత్నమని విమర్శించారు.కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరింత పట్టుదలతో పోరాడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు శిఖిలం కుమారస్వామి,ఎలగందుల సిద్దులు,ఇక్కిరి శ్రీనివాస్,ఆర్.ఉదయ్‌తో పాటు పార్టీ జిల్లా,డివిజన్,గ్రామ నాయకులు ఆర్.సీత,చిరబోయిన కొమురయ్య, మారుజోడు సిద్దేశ్వర్,తమ్మడి అంజయ్య,డొంకెన శ్రీహరి,తమ్మడి రమేష్,గోవింద్ పరమేష్,కొమ్మిడి శ్రీకాంత్ రెడ్డి,కుర్రి మార్కండేయ,దార యాదగిరి,కడకంచి సత్యనారాయణ,కడకంచి రమేష్,మేకల వెంకటేష్,బైరి చంద్రయ్య,కొమ్మిడి నర్సింహారెడ్డి,కడకంచి మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News