Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈ నెల మే 8,9,10 తేదీలలో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 09:09 PM

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత
May 03, 2026 07:17 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-సాయి గూడెంలో ఘనంగా మేడే వేడుకలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్‌లు కార్మికులను యాజమాన్యాల ముందు బానిసలుగా మార్చడానికే దోహదపడుతున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు విమర్శించారు.ఆలేరు మండల పరిధిలోని సాయి గూడెంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 140వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను గ్రామ కమిటీ కార్యదర్శి కొమ్మిడి గోపాల్ రెడ్డి ఎగురవేశారు.చికాగో అమర వీరులకు నివాళులు అర్పిస్తూ విప్లవ జోహార్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్,ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్,ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్ మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని దినం,ఓటు హక్కు,సమానత్వం కోసం చేసిన పోరాటం ఫలితంగా అనేక కార్మిక హక్కులు సాధించారని పేర్కొన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయని,ఇప్పటికే సాధించిన చట్టాలను బలహీనపరిచే ప్రయత్నమని విమర్శించారు.కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరింత పట్టుదలతో పోరాడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు శిఖిలం కుమారస్వామి,ఎలగందుల సిద్దులు,ఇక్కిరి శ్రీనివాస్,ఆర్.ఉదయ్‌తో పాటు పార్టీ జిల్లా,డివిజన్,గ్రామ నాయకులు ఆర్.సీత,చిరబోయిన కొమురయ్య, మారుజోడు సిద్దేశ్వర్,తమ్మడి అంజయ్య,డొంకెన శ్రీహరి,తమ్మడి రమేష్,గోవింద్ పరమేష్,కొమ్మిడి శ్రీకాంత్ రెడ్డి,కుర్రి మార్కండేయ,దార యాదగిరి,కడకంచి సత్యనారాయణ,కడకంచి రమేష్,మేకల వెంకటేష్,బైరి చంద్రయ్య,కొమ్మిడి నర్సింహారెడ్డి,కడకంచి మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News