Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:49 AM

అయిలయ్య దిష్టిబొమ్మ దహనం హరీశ్‌రావుపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం

అయిలయ్య దిష్టిబొమ్మ దహనం హరీశ్‌రావుపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం

అయిలయ్య దిష్టిబొమ్మ దహనం హరీశ్‌రావుపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం
May 04, 2026 06:33 PM 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఆందోళన చేపట్టారు.

ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించిన పార్టీ నేతలు ‘ఖబర్ధార్ అయిలయ్య’, ‘డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన కూడలిలో అయిలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పలుమార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. హోదా మరిచి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోళ్లు మందగించాయని, ఇంకా 30 శాతం వరకు కొనుగోళ్లు పూర్తి కాలేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. బీర్ల అయిలయ్య వెంటనే హరీశ్‌రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ మాజీ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, యువజన నాయకులు ముక్యర్ల సతీష్ యాదవ్, బాలయ్య, సర్పంచ్ గడ్డం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News