Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామానికి 100 మంది కూలీలు తప్పనిసరి. ఎంపీడీవో రాములు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 07:44 PM

అయిలయ్య దిష్టిబొమ్మ దహనం హరీశ్‌రావుపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం

అయిలయ్య దిష్టిబొమ్మ దహనం హరీశ్‌రావుపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం

అయిలయ్య దిష్టిబొమ్మ దహనం హరీశ్‌రావుపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం
May 04, 2026 06:33 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఆందోళన చేపట్టారు.

ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించిన పార్టీ నేతలు ‘ఖబర్ధార్ అయిలయ్య’, ‘డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన కూడలిలో అయిలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పలుమార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. హోదా మరిచి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోళ్లు మందగించాయని, ఇంకా 30 శాతం వరకు కొనుగోళ్లు పూర్తి కాలేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. బీర్ల అయిలయ్య వెంటనే హరీశ్‌రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ మాజీ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, యువజన నాయకులు ముక్యర్ల సతీష్ యాదవ్, బాలయ్య, సర్పంచ్ గడ్డం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News