అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి
అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి
Editor Desk
ఆదోని,
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థానిక బుడెక్కల్ కార్యాలయంలో మంగళవారం కీర్తిశేషులు కామ్రేడ్ గోరుకల్లు అయ్యప్ప గౌడ్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని నియోజకవర్గ నాయకుడు బసాపురం గోపాల్ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్. సుదర్శన్, పట్టణ కార్యదర్శి టి. వీరేష్, మండల కార్యదర్శి బీజీ ఎల్లప్ప, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప గౌడ్ పేదల కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు.
భూమిలేని నిరుపేదలకు దొడ్డనకేరి గ్రామంలో సొంత భూములను పంచిపెట్టిన గొప్ప వ్యక్తిగా ఆయనను కొనియాడారు. సీపీఐ తరఫున ఎంపీటీసీగా గెలుపొందడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యుడిగా, సీపీఐ పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పార్టీ అభివృద్ధికి సేవలందించారని పేర్కొన్నారు.
అయ్యప్ప గౌడ్ సేవలను మరువలేమని, ఆయన ఆశయ సాధన కోసం అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోరుకల కృష్ణమూర్తి, డీహెచ్పీఎస్ కార్యదర్శి విజయ్, పుష్పరాజు, రాము, దొడ్డనకేరి ఉరుకుందు, మండిగిరి శేషప్ప, అస్లాం భాషా, ఉదయ్ కిరణ్ యాదవ్, శశి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి