Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:11 AM

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి
29-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థానిక బుడెక్కల్ కార్యాలయంలో మంగళవారం కీర్తిశేషులు కామ్రేడ్ గోరుకల్లు అయ్యప్ప గౌడ్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని నియోజకవర్గ నాయకుడు బసాపురం గోపాల్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్. సుదర్శన్, పట్టణ కార్యదర్శి టి. వీరేష్, మండల కార్యదర్శి బీజీ ఎల్లప్ప, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప గౌడ్ పేదల కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు.

భూమిలేని నిరుపేదలకు దొడ్డనకేరి గ్రామంలో సొంత భూములను పంచిపెట్టిన గొప్ప వ్యక్తిగా ఆయనను కొనియాడారు. సీపీఐ తరఫున ఎంపీటీసీగా గెలుపొందడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యుడిగా, సీపీఐ పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పార్టీ అభివృద్ధికి సేవలందించారని పేర్కొన్నారు.

అయ్యప్ప గౌడ్ సేవలను మరువలేమని, ఆయన ఆశయ సాధన కోసం అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోరుకల కృష్ణమూర్తి, డీహెచ్‌పీఎస్ కార్యదర్శి విజయ్, పుష్పరాజు, రాము, దొడ్డనకేరి ఉరుకుందు, మండిగిరి శేషప్ప, అస్లాం భాషా, ఉదయ్ కిరణ్ యాదవ్, శశి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి

Article Image

ఆదోని,

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థానిక బుడెక్కల్ కార్యాలయంలో మంగళవారం కీర్తిశేషులు కామ్రేడ్ గోరుకల్లు అయ్యప్ప గౌడ్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని నియోజకవర్గ నాయకుడు బసాపురం గోపాల్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్. సుదర్శన్, పట్టణ కార్యదర్శి టి. వీరేష్, మండల కార్యదర్శి బీజీ ఎల్లప్ప, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప గౌడ్ పేదల కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు.

భూమిలేని నిరుపేదలకు దొడ్డనకేరి గ్రామంలో సొంత భూములను పంచిపెట్టిన గొప్ప వ్యక్తిగా ఆయనను కొనియాడారు. సీపీఐ తరఫున ఎంపీటీసీగా గెలుపొందడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యుడిగా, సీపీఐ పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పార్టీ అభివృద్ధికి సేవలందించారని పేర్కొన్నారు.

అయ్యప్ప గౌడ్ సేవలను మరువలేమని, ఆయన ఆశయ సాధన కోసం అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోరుకల కృష్ణమూర్తి, డీహెచ్‌పీఎస్ కార్యదర్శి విజయ్, పుష్పరాజు, రాము, దొడ్డనకేరి ఉరుకుందు, మండిగిరి శేషప్ప, అస్లాం భాషా, ఉదయ్ కిరణ్ యాదవ్, శశి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News