Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 05:51 PM

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి
April 29, 2026 04:05 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థానిక బుడెక్కల్ కార్యాలయంలో మంగళవారం కీర్తిశేషులు కామ్రేడ్ గోరుకల్లు అయ్యప్ప గౌడ్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని నియోజకవర్గ నాయకుడు బసాపురం గోపాల్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్. సుదర్శన్, పట్టణ కార్యదర్శి టి. వీరేష్, మండల కార్యదర్శి బీజీ ఎల్లప్ప, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప గౌడ్ పేదల కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు.

భూమిలేని నిరుపేదలకు దొడ్డనకేరి గ్రామంలో సొంత భూములను పంచిపెట్టిన గొప్ప వ్యక్తిగా ఆయనను కొనియాడారు. సీపీఐ తరఫున ఎంపీటీసీగా గెలుపొందడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యుడిగా, సీపీఐ పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పార్టీ అభివృద్ధికి సేవలందించారని పేర్కొన్నారు.

అయ్యప్ప గౌడ్ సేవలను మరువలేమని, ఆయన ఆశయ సాధన కోసం అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోరుకల కృష్ణమూర్తి, డీహెచ్‌పీఎస్ కార్యదర్శి విజయ్, పుష్పరాజు, రాము, దొడ్డనకేరి ఉరుకుందు, మండిగిరి శేషప్ప, అస్లాం భాషా, ఉదయ్ కిరణ్ యాదవ్, శశి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News