అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,ఎమ్మెల్యే సంజీవరెడ్డి
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ పట్నే నాగనాథ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి వారి నివాసానికి చేరుకొని పట్నే నాగనాథ్ భౌతిక దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్నే నాగనాథ్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేసిన నాయకుడని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తి అని కొనియాడారు. ప్రజలతో మమేకమై పనిచేసిన మంచి నాయకుడిని కోల్పోవడం పార్టీకి, ప్రాంత ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కంగ్టి మండల ప్రజలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని పట్నే నాగనాథ్కు కన్నీటి నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి