ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్ను సందర్శించిన మంత్రి సవిత
ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్ను సందర్శించిన మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రివర్యులు సవిత నేడు అనంతపురం పట్టణంలోని సాయి నగర్ రెండవ క్రాస్లో పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు చంద్రకాంతమ్మ గారి కుమారుడు లికిత్ రామ్ ప్రారంభించిన ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్ను సందర్శించారు.
ఇటీవల ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మంత్రి సవిత పరిశీలించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన ఆర్థో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన మంత్రి సవిత రోగులకు సేవాభావంతో వైద్యం అందించాలని సూచించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన చికిత్స అందిస్తూ ఆరోగ్య సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి