Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:45 PM

ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి సవిత

ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి సవిత

ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి సవిత
May 18, 2026 01:43 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రివర్యులు సవిత నేడు అనంతపురం పట్టణంలోని సాయి నగర్ రెండవ క్రాస్‌లో పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు చంద్రకాంతమ్మ గారి కుమారుడు లికిత్ రామ్ ప్రారంభించిన ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించారు.


ఇటీవల ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మంత్రి సవిత పరిశీలించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన ఆర్థో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.


ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన మంత్రి సవిత రోగులకు సేవాభావంతో వైద్యం అందించాలని సూచించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన చికిత్స అందిస్తూ ఆరోగ్య సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News