Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 09:52 PM

ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి సవిత

ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి సవిత

ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి సవిత
May 18, 2026 01:43 AM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రివర్యులు సవిత నేడు అనంతపురం పట్టణంలోని సాయి నగర్ రెండవ క్రాస్‌లో పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు చంద్రకాంతమ్మ గారి కుమారుడు లికిత్ రామ్ ప్రారంభించిన ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించారు.


ఇటీవల ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మంత్రి సవిత పరిశీలించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన ఆర్థో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.


ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన మంత్రి సవిత రోగులకు సేవాభావంతో వైద్యం అందించాలని సూచించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన చికిత్స అందిస్తూ ఆరోగ్య సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News