ఆర్టీసీకి శుభవార్త.. నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం
ఆర్టీసీకి శుభవార్త.. నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం
Editor Desk
విలీనం దిశగా ఆర్టీసీ.. రామన్నపేటలో సంబరాలు
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు స్పందనగా రామన్నపేటలో సంబరాలు నెలకొన్నాయి. మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఆర్టీసీ కార్మికులకు 10 శాతం పీఆర్సీ, ప్రభుత్వంలో విలీనం, సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి నిర్ణయాలు కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుతూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మండల అధ్యక్షుడు బట్టే సంతోష్ కుమార్ మాట్లాడుతూ, కార్మికుల చిరకాల డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నిర్ణయాలు వారికి పెద్ద ఊరటనిచ్చాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పున్న అమరేందర్, గురిజాల మహేష్ రెడ్డి, కల్లూరి శివ, మేకల జలేందర్, జవ్వాజి శ్రీకాంత్, కందుల సాయిరాం, సింగరాజు సుమంత్, కేశవదాసు ఉదయ్, మొహమ్మద్ అజార్, కొండా సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి