Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: అదనపు ఎస్పీ చైతన్య డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 07:10 PM

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం
April 29, 2026 05:39 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, తద్వారా సమ్మె విరమణ జరగడం పట్ల మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.​ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల యువజన అధ్యక్షులు రాచకొండ భార్గవ్ నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.​ఈ సందర్భంగా రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ:​"ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం శుభపరిణామం. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్న కార్మికులకు, నాయకులకు అభినందనలు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం."ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాల మణికంఠ యాదవ్, మండల కమిటీ కార్యదర్శులు పబ్బతి వెంకటేష్, ఆవుల రాజు, వర్కల రాము, చింతల శివ, యువజన కాంగ్రెస్ నాయకులు పన్నాల మధుసూధన్ రెడ్డి, మొగుదాల వెంకటేష్, చింతకింది గణేష్, యాట సంతోష్, సురకంటి బాలకృష్ణ రెడ్డి, సందగళ్ల కిరణ్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, రాచకొండ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News