Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:24 AM

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం
April 29, 2026 05:39 PM 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, తద్వారా సమ్మె విరమణ జరగడం పట్ల మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.​ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల యువజన అధ్యక్షులు రాచకొండ భార్గవ్ నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.​ఈ సందర్భంగా రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ:​"ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం శుభపరిణామం. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్న కార్మికులకు, నాయకులకు అభినందనలు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం."ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాల మణికంఠ యాదవ్, మండల కమిటీ కార్యదర్శులు పబ్బతి వెంకటేష్, ఆవుల రాజు, వర్కల రాము, చింతల శివ, యువజన కాంగ్రెస్ నాయకులు పన్నాల మధుసూధన్ రెడ్డి, మొగుదాల వెంకటేష్, చింతకింది గణేష్, యాట సంతోష్, సురకంటి బాలకృష్ణ రెడ్డి, సందగళ్ల కిరణ్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, రాచకొండ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News