Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:45 PM

ఆర్టీసీ ద్వారా ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు

ఆర్టీసీ ద్వారా ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు

ఆర్టీసీ ద్వారా ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు
March 09, 2026 04:50 PM 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

సికింద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు సులభంగా అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ డిపోలో తలంబ్రాల బుకింగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను డిపో మేనేజర్ సుధాకర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తులకు తలంబ్రాలను నేరుగా ఇంటి వద్దకే చేర్చే విధంగా ఆర్టీసీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

తలంబ్రాల బుకింగ్ కోసం కంటోన్మెంట్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ను 9154298820, 9154298831, 9154298863 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి కృష్ణ, రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బాలరాజ్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News