ఆర్టీసీ ద్వారా ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు
ఆర్టీసీ ద్వారా ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు
Prabhakar
సికింద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు సులభంగా అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ డిపోలో తలంబ్రాల బుకింగ్కు సంబంధించిన పోస్టర్ను డిపో మేనేజర్ సుధాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తులకు తలంబ్రాలను నేరుగా ఇంటి వద్దకే చేర్చే విధంగా ఆర్టీసీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తలంబ్రాల బుకింగ్ కోసం కంటోన్మెంట్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ను 9154298820, 9154298831, 9154298863 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి కృష్ణ, రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బాలరాజ్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్తో పాటు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి