కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులో 15 తులాల బంగారం అపహరణ
బస్సులో బంగారు అపహరణ కలకలం రేపింది. ప్రొద్దుటూరు నుంచి కోగటం మీదుగా కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.
కమలాపురం వద్ద శ్రీదేవి అనే మహిళ బస్సులో ఎక్కింది. పాపాగ్ని నది సమీపంలో తన ఆధార్ కార్డు బ్యాగ్లో నుంచి తీసి కండక్టర్కు చూపిస్తుండగా, అదే సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె బ్యాగ్లో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించినట్లు తెలుస్తోంది.
బంగారం మాయమైన విషయం గమనించిన బాధితురాలు శ్రీదేవి లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెనక్కి తిప్పి కమలాపురం పోలీస్ స్టేషన్కు తరలించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు బస్సులోని ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే చోరీపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి