Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:06 PM

ఆర్టీసీ బస్సులో మహిళకు 15 తులాల బంగారం చోరీ

ఆర్టీసీ బస్సులో మహిళకు 15 తులాల బంగారం చోరీ

ఆర్టీసీ బస్సులో మహిళకు 15 తులాల బంగారం చోరీ
February 22, 2026 08:42 AM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులో 15 తులాల బంగారం అపహరణ

బస్సులో బంగారు అపహరణ కలకలం రేపింది. ప్రొద్దుటూరు నుంచి కోగటం మీదుగా కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

కమలాపురం వద్ద శ్రీదేవి అనే మహిళ బస్సులో ఎక్కింది. పాపాగ్ని నది సమీపంలో తన ఆధార్ కార్డు బ్యాగ్‌లో నుంచి తీసి కండక్టర్‌కు చూపిస్తుండగా, అదే సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె బ్యాగ్‌లో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించినట్లు తెలుస్తోంది.

బంగారం మాయమైన విషయం గమనించిన బాధితురాలు శ్రీదేవి లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెనక్కి తిప్పి కమలాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు బస్సులోని ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే చోరీపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News