Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:09 PM

ఆర్టీసీ బస్సులో మహిళకు 15 తులాల బంగారం చోరీ

ఆర్టీసీ బస్సులో మహిళకు 15 తులాల బంగారం చోరీ

ఆర్టీసీ బస్సులో మహిళకు 15 తులాల బంగారం చోరీ
February 22, 2026 08:42 AM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులో 15 తులాల బంగారం అపహరణ

బస్సులో బంగారు అపహరణ కలకలం రేపింది. ప్రొద్దుటూరు నుంచి కోగటం మీదుగా కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

కమలాపురం వద్ద శ్రీదేవి అనే మహిళ బస్సులో ఎక్కింది. పాపాగ్ని నది సమీపంలో తన ఆధార్ కార్డు బ్యాగ్‌లో నుంచి తీసి కండక్టర్‌కు చూపిస్తుండగా, అదే సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె బ్యాగ్‌లో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించినట్లు తెలుస్తోంది.

బంగారం మాయమైన విషయం గమనించిన బాధితురాలు శ్రీదేవి లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెనక్కి తిప్పి కమలాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు బస్సులోని ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే చోరీపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News